జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
కుక్కల వృద్ధి నియంత్రణ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కుక్కల వృద్ధి నియంత్రణ కేంద్రం, బాంబుల గడ్డ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, కలక్టర్ కార్యాలయం వెనుక ఉన్న తుమ్మల చెరువును మున్సిపల్ అధికారులతో కలిసి పరిశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కుక్కల వృద్ధి నియంత్రణకు కు.ని ఆపరేషన్లు నిర్వహించేందుకు అనుభవజ్ఞులై వైద్యాధికారుఆ ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కుక్కల వృద్ధిని నియంత్రణ చేసేందుకు వీధి కుక్కలను యానిమల్ బర్త్ కేర్ యూనిట్ కు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, సంరక్షణ తదుపరి వాటిని యదావిధిగా పట్టుకున్న స్థానాలలో విడిచి పెట్టాలని తెలిపారు. కుటుంబ నియంత్రణ వల్ల వీధి కుక్కల వృద్ధిని నియంత్రణ జరుగుతుందని తెలిపారు.
బాంబుల గడ్డ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని తెలిపారు. ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త సేకరణ పక్కాగా జరగాలని,
సేకరించిన వ్యర్దాలను డంపింగ్ యార్డులో వర్మీ తయారు చేసి వ్యర్దాలు నుండి ఆదాయం సమకూర్చే విధంగా మున్సిపాలిటీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం
కలక్టరేట్ కార్యాలయం వెనుక ఉన్న తుమ్మలను పరిశీలించారు. పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ చెరువును అందంగా తీర్చి దిద్ది ప్రజలు వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్, పూలమొక్కలు, కూర్చోడానికి బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా తయారు చేయాలని పేర్కొన్నారు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వైపు నీరు నిల్వ ఉండకుండా గ్రావెల్ తో నింపి, డ్రైనేజీలు నిర్మించి నీరు నిల్వలు లేకుండా చేయాలని మున్సిపల్ అధికారులను కలక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, ఏ.ఈ తదితరులు పాల్గొన్నారు.