-వందశాతం రైతు రుణమాఫీ చేసి తీరుతాం
-కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళల్లో ఆనందన్ని నింపింది
-పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్
సిరా న్యూస్,మంథని;
అహింస గురించి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, రైతు నాయకుడు గుండా రాజు లు అన్నారు.
బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని రైతులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు 100% రెండు లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేసి తీరుతామని అన్నారు.100% రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని, దశలవారీగా రుణమాఫీ పక్రియ జరుగుతుందని ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయడం దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని, నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో, నేడు సీఎం రేవంత్ రెడ్డి, నేతత్వంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళల్లో ఆనందన్ని నింపిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతు రుణమాఫీ జరగలేదని ఆయన ఆరోపించారు. . బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో రక్తపాతం జరిగిందని, దానికి బాధ్యులైన వారికి త్వరలోనే శిక్ష పడుతుందని ఆయన అన్నారు. జీవో నెంబర్ 567 గురించి చెప్పి రైతులను ఆందోళనకు గురి చేయవద్దని ఆయన కోరారు. 567 జీవో ద్వారా ఒకే కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి రుణమాఫీ పొందకుండా, నకిలీ పాస్ పుస్తకాలతో రుణమాఫీ తీసుకున్న వారికి మాత్రమే వర్తించకుండా జీవో తీసుకువచ్చారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పాలనలో రైతులు వడ్ల బస్తాకు ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు కటింగ్ జరిగిందని, కాంగ్రెస్ పాలనలో కటింగ్ లేకుండా చేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల వడ్ల బస్తాల నుంచి కటింగ్ జరగలేదు అని చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వోడ్నాల శ్రీనివాస్, పోలు శివ, కుడుదుల వెంకన్న, జనగామ నర్సింగరావు, నూకల బానయ్య, గోటికారి కిషన్ జి, మంతెన సత్యం, వేరవేన లింగయ్య యాదవ్, మంతెన శ్రీనివాస్, రామ్ రాజశేఖర్, పేరవేన మోహన్ యాదవ్, బూడిద శంకర్, మంతెన సురేష్, సింగారపు కిష్టయ్య, గుండా పాపారావు, పెంటరి రాజు, మంథని శ్రీనివాస్, నరేడ్ల ఓదెలు, కాజీపేట బాపు, జనగామ సడవలి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.