Ambedkar Sangam Kande Sudhakar: దళితవాడలోని కరెంటు బిల్లులను మాఫీ చేయాలి

సిరాన్యూస్‌,భీమదేవరపల్లి
దళితవాడలోని కరెంటు బిల్లులను మాఫీ చేయాలి
* తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్

దళితవాడలో ఇంటి కరెంటు బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్ డిమాండ్ చేశారు. బుధ‌వారం భీమదేవరపల్లి మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశ‌లంలో ఆయ‌న మాట్లాడారు. బడుగు ,బలహీన వర్గాలు ఇంటి కరెంటు బిల్లులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్లు, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అయోమయంలో దళితులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సర్కారు రైతు రుణమాఫీ చేసిన సందర్భంలో డబ్బులు వచ్చినవి అనే ఉద్దేశంతో వారిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇండ్లలో కరెంట్ కట్ చేస్తున్నారని, తక్షణమే సర్కారు చర్య తీసుకుని, దళిత వాడల్లో ఉన్నటువంటి కరెంటు బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *