సిరాన్యూస్, కళ్యాణదుర్గం
పశువుల షెడ్లు కోసం దరఖాస్తు చేసుకోండి: పశు వైద్యాధికారి సూర్యనారాయణ
రైతులు పశువుల షెడ్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని కళ్యాణదుర్గం రూరల్ పశు వైద్యాధికారి సూర్యనారాయణ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వం మినీ గోకులాల పథకం ద్వారా 30 శాతం సబ్సిడీతో రైతులకు కేటాయించిందని తెలిపారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల సంతతిని కాపాడాలని సూచించారు.