సిరా న్యూస్,ఆర్మూరు;
నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మాణిక్ బండారు గ్రామంలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కొందరు వ్యక్తులు, క్షుద్ర పూజలు చేస్తున్నారని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, పోలీసులు మత్రం సమాచారం ఇచ్చిన గ్రామస్థులపైనే కేసు బనాయించారని స్థానికులు ఆరోపించారు. పైగా గ్రామంలో లాఠీ చార్జ్ చేసారని మండిపడ్డారు.
అర్ధరాత్రి 12:30 గంటలకు వందల సంఖ్యలో ఉన్న గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టే పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. క్షుద్ర పూజలను ప్రోత్సహించే పోలీసులు పై ఉన్నతాధికారులు వారిపై కఠిన చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు