ఆపై ఆత్మహత్య
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి పద్మావతి నగర్ లో విషాదం జరిగింది. అన్న పిల్లలు దేవిశ్రీ, నీరజ లతో పాటు అన్న భార్య వదిన సునీత ను హత్య చేసిని గుడిమెట్ల మోహన్ అని ఒక సాఫ్టువేర్ ఇంజనీర్ ఆపైన ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సమగ్ర దర్యాప్తు కు ఆదేశించారు. కుటుంబ కలహాలతో తమ్ముడు అన్న భార్య, పిల్లలను హతమార్చాడు. హత్యలు జరిగిన సమయంలో ఇంటిలో ఎవరెవరు ఉన్నారు.. అనేదానిపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించింది. సొంత మరిదే వదినను, అన్న పిల్లలను హత్య చేసేందుకు గల కారణాల గురించి వివిధ కోణాలలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు