ఏలూరు లో నకిలీ రిపోర్టర్ల హల్ చల్

సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు లో ఏలూరులో నకిలీ రిపోర్టర్ల అరెస్టు కలకలం రేపింది. వీరిలో ఇద్దరు మహిళా రిపోర్టర్లు వుండడం విశేషం. ఈ ముఠా దందాలు ఎంతో కాలంగా నడుస్తున్నా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ముఠా లో కీలక వ్యక్తి ఒక రౌడీ షీటర్. పోలీసులు మాట్లాడుతూ ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులమని అంటూ.. బెదిరించిన 4 గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసామని వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు మంగళవారం నాడు ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. ఏలూరు మండలం కొత్తూరు సుందర కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో ఉన్న అప్పలనాయుడు కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న మండల అప్పల నాయుడు పై ముద్దాయిలు ఫుడ్ ఇన్స్పెక్టర్లమని కూరలలో కెమికల్స్ ఉన్నాయని, మీ షాపుకు లైసెన్స్ లేదని బెదిరించి కర్రీ పాయింట్ వ్యాపారస్తుడు నుండి పదివేల రూపాయలు డబ్బులు తీసుకున్నారని రాబడిన ఫిర్యాదు పై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఏలూరు SDPO E. శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏలూరు వన్ టౌన్ సీఐ రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ ఐ కే రాజారెడ్డి వారి సిబ్బంది ఒక టీం గా ఏర్పడి బుధవారం నాడు ఆశ్రమం జంక్షన్ వద్ద 4 ముద్దాయిలు మోటార్ సైకిళ్లపై పరార్ అవుతుండగా అరెస్ట్ చేయడం జరిగిందని, వీరు దగ్గర నుండి రెండు మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మీడియాకు వివరించారు. నిందితులు ఘంటసాల దుర్గ (32). బుక్కురి దేవి ప్రసాద్ (29). అగ్గాల ఉమామహేశ్వరి (28). పులిగా రాంబాబు (38).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *