సత్తెనపల్లిలో దారి కాచి వ్యక్తిపై దాడి…

బాధితుడు అంబటి రాంబాబు ఫోటోగ్రాఫర్
సిరా న్యూస్,సత్తెనపల్లి;
మాజీజి మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ మట్టుపల్లి మోజేష్ పై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసారు. సత్తెనపల్లి మండలం నందిగామ శివారు ప్రాంతంలో ఘటన జరిగింది. మోజేష్ పై దారి కాచి గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసారు. దాడి చేసి ఒంటిపై వున్న దుస్తులు చించివేసి నగ్నంగా కొట్టి పడేసారు. తీవ్ర గాయాలతో బాధితుడు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *