వెన్ను పొడిచినోళ్ల సంగతి తేలుస్తా

సిరా న్యూస్,మహబూబాబాద్;
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
మాస్ వార్నింగ్ ఇచ్చారు.శుక్రవారం మీడియాతో అయన మట్లాడారు. పార్టీ లో ఉండి ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా. ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్,, ఇంకా నన్ను ఏం చేస్తార్ర బై అంటూ మండిపడ్డారు. ఇక ఒక్కోక్కడిని ఆట ఆడుకుంటా… వేట మొదలైంది. కెసిఆర్ హాస్పిటల్ లో ఉండి బుక్స్ చదువుతున్నాడు, భవిష్యత్తు ఎలా చెయ్యాలని. శంకర్ నాయక్ , కెసిఆర్ ఒక్క కార్తె లోనే పుట్టాం బిడ్డ. కార్యకర్తలను కాపాడుకునే సత్తా నాకు పుష్కలంగా ఉందని అన్నారు.
రాత్రి 12 గంటలకు ఆపద వచ్చిన ఫోన్ చేయండి వస్తా. నీకు ధైర్యం ఉంటే నా కార్యకర్తను ముట్టుకో, తర్వాత ఏమైతదో చూసుకో. ఇన్నిరోజులు ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే అలోచించాను, ఇప్పుడు మనల్ని ఆపేటోడు లేడు. ఒక్క అయ్యా అవ్వకు పుట్టి ఉంటే, నేను చేసిన తప్పులను నిరూపించాలని నాపై ఆరోపణలు చేసిన వారికీ సవాల్ చేసిన కానీ ఎవ్వడు రాలే దని అన్నారు.
మనం ఎవ్వరి జోలికి పోవొద్దు, మన జోలికి వస్తే వదిలిపెట్టొద్దు. కార్యకర్తకు ఆపద వస్తే మెరుపు వేగంతో వస్తా… మీకు అండగా నిలబడుతా నని అన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *