మత్స్యకారుల మధ్య పంచాయితీలు పెట్టించిన కేసీఆర్

సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ‘తెలంగాణ ఫిషరీస్ చైర్మన్’ ‘మెట్టు సాయికుమార్ ‘ కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కెసిఆర్ మత్స్యకారుల కుటుంబాలను ఇబ్బందిపెట్టిన విషయం మరిచిపోయారా ? కెసిఆర్ మత్స్యకార కుటుంబాలను రాజకీయం కోణంలోనే చూసి కేవలం ఓటర్లుగానే పరిగణించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు, కుంటలు, గట్ల వద్ద మత్స్యకారుల మధ్య పంచాయతీలు పెట్టించాడని అన్నారు.
గత 9 ఏళ్ళలో బిఆర్ఎస్ రాజకీయ కోణం చెప్పలేనిది, చూడలేనిది.. నేడు ‘సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారులను సంక్షేమం, అభివృద్ధిలో ముందజలో ఉండేందుగా అన్ని రకాలుగా ఆడుకుంటాం. అట్టడుగున ఉన్న మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంలో మా ప్రభుత్వానికి ప్రణాళిక ఉంది. మత్స్యకారుల కుటుంబాలకు మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మత్స్యకారులకు స్వర్ణయుగం రానుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *