సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నేతాజీ వికాస్ పాఠశాలలో కలుషిత ఆహారంతో 40 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థునులను వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేశారు. నాణ్యతలేని ఆహారం కాలుషిత మంచినీరు వల్లే విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు వైద్యులు తెలియజేసినటువంటి పరిస్థితి. 40 మంది విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నప్పటికీ యాజమాన్యం తరఫున ఒక్కరు కూడా అక్కడ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. నేతాజీ వికాస్ పాఠశాల యాజమాన్యం వైఖరి పట్ల సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.