సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
పంచాయతీ అధికారి రత్నాకర్ రావును సన్మానించిన బీజేపీ నాయకులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమోషన్ పై వచ్చిన మండల పంచాయతీ అధికారిగా రత్నాకర్ రావు ను శుక్రవారం బిజెపి నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు గోపాల్ రెడ్డి, పదవీ విరమణ ఉపాధ్యాయులు తుమ్మనపల్లి వెంకటరమణ, ఎంఏ, వకీల్, పిల్లి శ్రీనివాస్, దొండి శ్రీకాంత్, సన్నిహితులు, తదితరులు పాల్గొన్నారు.