సిరాన్యూస్,ఏలూరు;
పశ్చిమగోదావరి జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడలో కార్ యాక్సిడెంట్ లో సాబ్జీ మృతి చెందారు. ఏలూరు నుండి భీమవరం వస్తుండగా జరిగిన ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి సాబ్జి కారు ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఘటన స్థలంలో ఎమ్మెల్సీ మృతిచెందగా సీసీకి గాయాలయ్యాయి. గన్మెన్ కి కూడా గాయాలయ్యాయి భీమవరం వర్మ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు