ఆగివున్న లారీని ఢీకొన్న బస్సు…మహిళ మృతి

సిరా న్యూస్,ఏలూరు;
విజయవాడ దుర్గ గుడికి ఆషాడం సారే సమర్పించేందుకు భక్తులు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు సమీపంలోని జాతీయ రహదారిపై కలపర్రు వద్ద ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని పార్వతిపురం నుంచి విజయవాడ వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఘటనలో ఒక మహిళ భక్తురాలు మృతి చెందగా 15 మంది పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ,డ్రైవర్ కు తీవ్ర గాయాలు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను ఫైర్ సిబ్బంది బయటకు తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *