సిరాన్యూస్,ఓదెల
రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలు
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న దానవేణి కుమార్ (35), అతని కుమారుడు దానవేణి అర్జున్ సాయి (12) పోత్కపల్లి గ్రామంలోని పెద్ద చెరువు మొదటి తుము మూల వద్ద వారిని వేగంగా వస్తున్నకారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దానవేణి కుమార్ , దానవేణి అర్జున్ సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేయగా వచ్చి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.