సిరా న్యూస్,ఓదెల
30న చలో హైదరాబాద్ కార్యక్రమం
* పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పైడిపల్లి నాగరాజు
పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు పైడిపల్లి నాగరాజు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నా వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికులను పెర్మనెంట్ చేయాలి, మల్టీపర్సన్ వ్యవస్థను తీసివేయాలని కోరారు. పారిశుధ్య కార్మికుల అవసర సామాగ్రి అందించాలన్నారు.