సిరా న్యూస్,బోథ్
విశిష్ట ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నఉపాధ్యాయుడు చిలుక సతీష్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా వినూత్నమైన బోధన బోధిస్తూ, విద్యార్థులను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నఆదిలాబాద్ జిల్లా బోథ్ కన్గుట్ట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చిలుక సతీష్కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి “జిల్లా స్థాయి విశిష్ట ఉపాధ్యాయ పురస్కారము అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు చిలుక సతీష్ మాట్లాడుతూ నా యొక్క సేవలను గుర్తించి నన్ను విశిష్ట ఉపాధ్యాయ పురస్కారంతో సత్కరించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.