సిరాన్యూస్, ఆదిలాబాద్
బానోత్ కిషన్ మహరాజ్ కు ఘన నివాళి అర్పించిన దుర్గం శేఖర్
ఆదిలాబాద్ లోని పలు మండలాల్లో ఎంపీడీవో గా విధులు నిర్వహించిన బానోత్ దత్తరావ్ తండ్రి కిషన్ మహరాజ్ ఇటీవల మృతి చెందారు.ఈ నేపథ్యంలో మంగళవారం ఉట్నూర్ లోని వారి స్వగృహం వద్ద పెద్దకర్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ హాజరయ్యారు. కిషన్ మహరాజ్ చిత్రపటం వద్ద పుష్పాంజలు ఘటించి నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ తన కుమారుల ఉన్నతి కోసం కిషన్ మహరాజ్ ఎంతో కృషి చేశారని, వారంతా ప్రస్తుతం సమాజంలో ఉన్నత హోదాల్లో పని చేస్తూ ప్రజలకు సేవాలందిస్తున్నారని అన్నారు. విద్యతోనే మంచి స్థానంలో నిలబడవచ్చన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆ బాటలో నడిచారని పేర్కొన్నారు. ఉన్నతమైన ఆశయాలతో ఆదర్శవంతమైన జీవనం సాగించారని తెలిపారు. కార్యక్రమంలో బానోత్ ఆత్మరాం, ఆడే గజానంద్, సురేష్ , జాదవ్ సుమన్ బాయి, హరి నాయక్, కొల్లూరి, స్వామి,దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.