సిరాన్యూస్, బోథ్
జరిమానా కట్టి పశువులను తీసుకువెళ్లండి: ఈవో అంజయ్య
గ్రామంలో తిరిగే పశువులను జరిమానా కట్టి తీసుకెళ్లాలని ఈవో అంజయ్య అన్నారు. బోథ్ మండల కేంద్రంలో రోడ్లపై తిరిగే పశువులను పట్టణానికి చెందిన పలువురు మంగళవారం పట్టుకొని బంజరు దొడ్డికి తరలించారు. దాదాపు 40 వరకు పశువులను బంజర దొడ్డిలో వేయడం జరిగింది. అయితే ఈ పశువులన్నీ గ్రామం సమీపంలోని పంట పొలాలలో పడి పంటలను నాశనం చేస్తున్నాయన్న ఆగ్రహంతో వాటిని బంజరు దొడ్డిలో వేశారు. అయితే బంజర దొడ్డిలో వేసిన పశువులను యజమానులు తీసుకొని వెళ్లాలని లేకుంటే ఒక రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అయినా పశువులను తీసుకోకపోతే మూడు రోజుల తర్వాత వేలం వేయడం లేదా గోశాలకు తరలించడం జరుగుతుందని ఈవో అంజయ్య తెలిపారు