సిరా న్యూస్,ఒంగోలు;
ప్రకాశంజిల్లా సింగరాయకొండ మండలం వెంకటేశ్వర కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా పని చేస్తున్న బాషాని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వెంకటేశ్వరకాలనీకి చెందిన సుకన్య అనే మహిళపై మామ మాలకొండయ్య దాడి చేయగా, ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ పిఎస్ కు వెళ్ళింది. అయితే అక్కడ ఏఎస్సై గా పనిచేస్తున్న బాషా మహిళ బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించంతో పాటు చేయి చేసుకోవడంతో ఈ ఆందోళన మొదలైంది. అకారణంగా తమను కొట్టిన ఏఎస్సై ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ మహిళా బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో ఎస్సై శ్రీరామ్ ఆందోళనకారులు తో మాట్లాడి బాధిత మహిళకు న్యాయం చేస్తామని తరపు బంధువులు అరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ అవగా ఎస్సై శ్రీరామ్ జోక్యం చేసుకుని బాధిత మహిళకు తగిన న్యాయం చేయడంతో పాటు ఏఎస్సై పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఆందోళన సద్దుమణిగింది.