సిరాన్యూస్, బోథ్
పంద్రం శంకర్ను సన్మానించిన సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్
ఇటీవల అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన పంద్రం శంకర్ను బుధవారం సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ సన్మానించారు. ఈసందర్బంగా సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ మాట్లాడుతూ పంద్రం శంకర్ సామాజిక కార్యమాలు చేస్తూ ప్రజలకు అనేక విషయాలు ,చట్టం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలను చైతన్య వంతులుగా చేస్తున్నారు. ఇటీవల అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన మా పంద్రం శంకర్ నీ శాలువ తో చిరు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమం లో సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్, ప్రముఖ పాత్రికేయ మిత్రుడు షేక్ ఆలి,న్యాయవాదులు ఆడెపు హరీష్,కుమ్మరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.