సిరాన్యూస్, ఆదిలాబాద్
సమాజ హితం కోసం కృషి చేస్తా :మాజీ మంత్రి జోగురామన్న
* ఘనంగా అన్న బావు సాఠె కమిటీ వ్యవస్థాపక గంగారం వాగ్మారే వర్ధంతి
ప్రతినిత్యం ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటూ సమాజ హితం కోసం పని చేసిన వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అన్న బావు సాఠె కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారం వాగ్మారే ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టల వాడలోని మాంగ్ సమాజ్ కమిటి హాల్ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగురామన్నహాజరై గంగారం వాఘ్మారే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అంతకుముందు కమిటి హాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కమిటి ప్రతినిధులు నిర్మాణ వివరాలను ఆయనకు వివరించారు. అనంతరం గంగారం వాగ్మారే చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సమాజ అభ్యున్నతి కోసం గంగారాం వగ్మరే అవిశ్రాంత కృషి చేశారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ అన్నాబావు సాటే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశయంతో ముందుకు సాగారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ సమాజ అభివృద్ధి కోసం పాటు పడాలని సూచించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కష్టసుఖాల్లో బీఆర్ ఎస్ పార్టీ తరపున అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.కార్యక్రమలో ఉద్దవ్ కంలే వసుదేవ్,ధమ్మాపాల్, మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, నేతలు కుమ్ర రాజు కౌన్సిలర్లు.తదితరులు పాల్గొన్నారు.