సిరాన్యూస్, భీమాదేవరపల్లి
పాడి రైతులకు 11.57 కోట్ల బోనస్ : డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ
నూతన లోగో ఆవిష్కరణ
* ఘనంగా సభ్యులకు సన్మానం
భీమాదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీ సభ్యులకు రూ.11.57 కోట్ల బోనస్ పంపిణీ చేయనున్నట్లు డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ తెలిపారు. బుధవారం సంఘ ప్రధాన కార్యాలయ ఆవరణలో 22 వ వార్షిక మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ముల్కనూర్ సొసైటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి హాజరై మాట్లాడారు. నేడు 203 సంఘాలతో 24 వేల మంది సభ్యులతో 150 కోట్ల వ్యాపారం చేసే స్థాయికి ఎదగడంఅభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్వకృషి స్థానంలో ముల్కనూర్ పేరుతో నూతన లోగోను ఆవిష్కరించారు. అనంతరం అత్యధిక పాల పంపిణీ చేసిన సభ్యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిఎం మారుపాటి భాస్కర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు, ఆయా సంఘాల సభ్యురాలు, డెయిరీ ఉద్యోగులు పాల్గొన్నారు.