boath Bakery shop: కేక్ లో పురుగులు..బేక‌రీ షాప్ వ‌ద్ద యువ‌కులు ఆందోళన

సిరాన్యూస్‌, బోథ్‌
కేక్ లో పురుగులు..బేక‌రీ షాప్ వ‌ద్ద యువ‌కులు ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌ల కేంద్రంలోని మంగ‌ళ‌వారం సాయంత్రం వేడుకలను నిర్వహించడానికి ఓ బేకరీలో ద‌న్నూర్ గ్రామానికి కొంతమంది యువకులు కేక్ తీసుకొని వెళ్లారు. అయితే ఇంటికి వెళ్లిన యువ‌కులు కేక్‌ను ఓపెన్ చేయ‌డంతో పురుగులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో బిత్తరపోయిన యువకులు వెంటనే విషయాన్ని సంబంధిత షాప్ ఓనర్ కు సమాచారం ఇచ్చారు. స్పందించిన షాపు ఓనర్ తాను మరో ఇస్తానని మాట ఇచ్చారని కొనుగోలుదారులు సాయి, సాకేత్ లు తెలిపారు. అయితే బుధవారం కేకును తీసుకొని షాపు వద్దకు వచ్చి యజమానిని నిలదీశారు. యజమాని మాత్రం మీరు కేకును లేటుగా తీయడం వల్లనే ఆ విధంగా జరిగిందని పేర్కొనడంతో ఆగ్రహించిన వినియోగదారులు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో పలు హోటల్లు షాపుల్లో తయారు చేస్తున్న తినుబండారాలను నాణ్యత లేదని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినియోగ‌దారులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *