పండితుల పదోన్నతి తేదీ కామన్ గా ఉండాలి

– యూటీఎఫ్
సిరా న్యూస్,బద్వేలు;
ఉన్నతీకరణలో భాగంగా భాషోపాధ్యాయులైన తెలుగు,హిందీ, ఉర్దూ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల సహాయకులుగా పదోన్నతి పొంది భిన్న రకాలైన తేదీలలో జాయిన్ అయినట్లుగా నమోదు చేసుకున్నారని దీనిని సవరించి అందరికీ ఒకే తేదీ కామన్ గా ప్రకటించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కోరారు.కడప జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పరిపాలనాధికారి మునీర్ ఖాన్ ను కలిసి అందుకు సంబంధించిన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ 2019 నవంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు భాషోపాధ్యాయులకు ఉన్నతీకరణ పదోన్నతులు కల్పించడమైనదని అయితే పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు నవంబర్ ఒకటవ తేదీ నుండి నాలుగో తేదీ వరకు వివిధ తేదీలలో చేరడం వలన బదిలీల సమయంలోనూ, పదోన్నతుల్లోను కొంతమేర స్పష్టత కొరవడి సీనియార్టీ విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.జిల్లా విద్యాశాఖాధికారి ఈ విషయాన్ని పరిశీలించి పదోన్నతి పొందిన పాఠశాల సహాయకులు తెలుగు,హిందీ,ఉర్దూ మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు అందరికీ 2019 నవంబర్ ఒకటో తేదీని కామన్ సీనియార్టిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు వై రవికుమార్ జిల్లా కార్యదర్శి ఏజాస్ అహమ్మద్ నాయకులు బత్తుల చంద్రశేఖర్, గాజులపల్లి గోపీనాథ్, యడాల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *