బతికుండగానే డెత్ సర్టిఫికెట్
సిరా న్యూస్,హైదరాబాద్;
ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ లో చేరారు. శస్త్ర చికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంబులెన్స్ లో స్వగ్రామం తీసుకు వెళ్తుండగా లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులపై అతని కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు.