సిరాన్యూస్, బోథ్
ఏజీపీ పంద్రం శంకర్ ను సన్మానించిన మైనారిటీ యువకులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ సివిల్ కోర్టులో నూతనంగా నియమితులైన ఏజీపీ పంద్రం శంకర్ ను గురువారం మైనారిటీ యువకులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ… ప్రజలకు సమన్యాయం అందిస్తానన్నారు. మైనారిటీ యువకులు మాట్లాడుతూ పేద ప్రజలకు సరైన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహమ్మద్ ,ఇమ్రాన్, షఫీ న్యాయవాదులు ఠాకూర్, రూపేందర్, సింగ్ హరీష్, జమీర్, గౌతమ్, పురుషోత్తం, కానిస్టేబుల్ దివాకర్లు పాల్గొన్నారు