సిరాన్యూస్, బోథ్
బోథ్లో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగ ఉప కులాలకు పోరాటం ఇచ్చిందని, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలించిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా స్వామి పేర్కొన్నారు. గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలబడిన వెంటనే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు టపాకాయలు పేల్చి సంతోషం వ్యక్తపరిచారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల మాదిగ జాతికే కాకుండా ఉపకులాల వారందరికీ భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.