Srirampur BJP: స్థానిక సంస్థల్లో బీజేపీ స‌త్తా చాటాలి:  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలరపు పర్వతాలు

సిరాన్యూస్‌, శ్రీరాంపూర్
స్థానిక సంస్థల్లో బీజేపీ స‌త్తా చాటాలి:  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలరపు పర్వతాలు

స్థానిక సంస్థల్లో బీజేపీ స‌త్తా చాటాల‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలరపు పర్వతాలు అన్నారు. గురువారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలరపు పర్వతాలు మాట్లాడారు. కార్యకర్తలు అందరూ కలిసి ఉండాలని, స్థానిక సంస్థలలో అన్ని గ్రామాలలో బీజేపీని గెలిపించాల‌ని అన్నారు. ఎస్సీ మోర్చా క్యతం వెంకటరమణ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం మోడీ  గొప్పతనం అని అన్నారు. స‌మావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, ఈర్ల శంకర్, ఖ్యాతం వెంకటరమణ అశోక్ ,రాములు, తిరుపతి, బీజేపీ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *