సిరాన్యూస్, బోధ్
నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగల చిత్రపటాలకు పాలాభిషేకం
30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబీసీడీ వర్గీకరణ జరగడం సంతోషకరమని సుప్రీంకోర్టు తీర్పు వల్ల మాదిగలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు జి దినేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఓఆర్డినేటర్ నక్క రాజశేఖర్, సీనియర్ నాయకులు కిష్టయ్య, దేవుల రాజలింగు, సంతోష్ డీఎస్పీ నాయకులు గణేష్, రాజు హరీష్ అఖిల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు