సిరాన్యూస్, బేల
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సూపర్ వైజర్ జావిద్
సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూపర్ వైజర్ జావిద్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆధ్వర్యంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా క్లినికల్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్బంగా దోమకాటుకు గురవకుండా జాగ్రత్త గా ఉండాలన్నారు. జ్వరాలు వస్తే వెంటనే రక్తపరీక్షలు చేయించుకో వాలన్నారు. దోమకాటుతో మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తాయని, కావున దోమకాటుకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. విష జ్వరాలు బారిన పడకుండా దోమతెరలు, దోమల నివారించే స్ప్రే మందులు వాడాలని అవగాహన కల్పించారు. చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు డ్రైనేజ్ పరిశుభ్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో స్టాప్ సుశీల తదితరులు పాల్గొన్నారు.