కలుషితమవుతున్నమిషన్ భగిరథ నీళ్లు

సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్లు కలుషితమై వస్తున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు స్వచ్ఛమైన నీరుగా రాకుండా కలుషితమై పచ్చని రంగులో వస్తుంది.మురికిగా మరుతూ తాగడానికి ఏమాత్రం పనికి రాకుండాపోతోంది. మురికితోపాటు బిందెలు అడుగుభాగంలో మొత్తం బురద పేరుకుంటున్నది.దీంతో తాగడానికి కాదు కదా కనీస అవసరాలకు వాడుకోవడానికి వీలు లేదు.గత్యంతరం లేక ఆ నీటిని వాడుకొని రోగాల బారిన పడుతున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు.సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఫిల్టర్ కాకుండానే ఇలా నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *