సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో సోమవారం గ్రామ నల్లచెరువులో ప్రమాదవశాత్తు పడి పశువుల కాపరి మృతి చెందాడు. పశువులు మేపేందుకు చెరువు వైపు వెళ్లిన విజయ్(36) అనే పశువుల కాపరి పశువులు చెరువులోకి దిగటంతో వాటిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో నీళ్లలో దిగాడు. ఇటీవల కొందరు చెరువు లో మట్టి తవ్వకాల కోసం చెరువులో భారీ గుంటలు చేసారు. ఆ గుంటలో పడిన విజయ్ ఈత రాకపోవడంతో మృతి చెందాడు. చెరువులోకి వెళ్లి రాకపోవడంతో గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లతో గాలింపు జరిపారు. మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.