సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : తెలంగాణ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు వేముల
* ఆదిత్య నగర్ కాలనీ “స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు వేముల అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 12వ వార్డ్ ఆదిత్య నగర్ కాలనీలో సోమవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా తెలంగాణ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు వేముల మాట్లాడారు. ” పచ్చని చెట్లు -ప్రగతికి మెట్లు” అని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలను పెంచాలన్నారు. గ్రామాలు -పట్టణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని లక్ష్యంతో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం కాలనీలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్ రజిత , మంజుల, మరియమ్మ, లఖన్ తదితరలు పాల్గొన్నారు.