దివ్యాంగుల శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమాడి

సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ స్మార్ట్ సిటి పరిధిలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులతో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిభిరాలను నిర్వహిస్తున్నామని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ పాఠంశెట్టి నారాయణమూర్తి తెలియచేసారు. 2వ తేదిన పిఠాపురంలోను, 3వ తేదిన జగ్గంపేటలోను ఈ శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు. 4వ తేదిన కాకినాడ అంబేద్కర్ భవన్లో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరూ, అధికారు లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గోన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *