సిరాన్యూస్, బేల
ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి: జిల్లా పంచాయతీ రాజ్ అధికారి శ్రీలత
ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి శ్రీలత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడీ గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం సదస్సు మండల ప్రత్యేక అధికారి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ రాజ్ అధికారి శ్రీలత మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. బడి పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. పచ్చదనం గురించి దిశనిర్దేశం సూచించారు. గ్రామంలో తిరిగి పలు ఐ హెచ్ హెచ్ ఎల్ లేని వాళ్లకు మరుగుదొడ్డి నిర్మాణ పనులను ప్రారంభించారు .గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్ జె, గ్రామపంచాయతీ కార్యదర్శి గౌతమ్ , ఫీల్డ్ అసిస్టెంట్ దీపక్ ,అంగన్వాడీ టీచర్స్ వందన, గ్రామస్తులు గంగన్న , రాకేష్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ తదితరులు పాల్గొన్నారు.