సిరాన్యూస్, ఓదెల
పునరావాస కేంద్రానికి 12 కుర్చీలు అందజేత: వీవోఏ వనిత- కుమార్
* ఘనంగా తన్విత పుట్టిన రోజులు వేడుకలు
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రానికి ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన వీవోఏ వనిత కుమార్ దంపతుల ద్వితీయ పుత్రిక తన్విత పుట్టినరోజు పురస్కరించుకొని మౌలిక వసతుల కోసం 12 కుర్చీలు వితరణ చేయడం జరిగింది అలాగే పిల్లలకు కూరగాయలతో భోజనం ఏర్పాటు చేశారు ఈ అనంతరం తన్విత తండ్రి కుమార్ మాట్లాడుతూ మానసిక వికలాంగుల మధ్య మా కూతురు పుట్టిన రోజు జరుపుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు .కార్యక్రమంలో ఐకెపిసిసి మారెళ్ళ శ్రీనివాస్, రాజకుమారి, వివో ఏలు పద్మ, రజిత, వరం, జ్యోతి బ్యాంకు మిత్ర దివ్య, మండల సమాఖ్య ఏపీఎం శ్రీనివాస్, ఏపీఎం గీత, ఐకేపీసీసీ అరుణ , కంప్యూటర్ ఆపరేటర్ ధర్మేంద్ర , సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.