సిరా న్యూస్,హైదరాబాద్;
వెంగళరావు నగర్ పరిసర ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిగా పెట్టారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఓ నలుగురు వ్యక్తులు గంజాయిని విక్రయించేందుకు వెంగళరావునగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఒక కేజీ గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.