సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
వేములవాడ రాజన్న క్షేత్రంలో నేటి నుండి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం నుండి నెల రోజులపాటు శ్రావణమాసం పురస్కరించుకొని సోమ, శుక్రవారములలో స్వామి,అమ్మ వారలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆలయ అర్చకులు మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు సాయంత్రం స్వామివారి కల్యాణ మండపంలో కి స్వామివారికి మహా లింగార్చన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.