సిరాన్యూస్, బోథ్
రోడ్డు కోసం గుట్ట పక్కతండా గ్రామస్తుల ధర్నా
* ఎస్సై హామీతో విరమించిన ఆందోళన
అదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలో గుట్ట పక్కతండా గ్రామంలో రోడ్డు కోసం గ్రామస్తులు సోమవారం ధర్నానిర్వహించారు. గుట్ట పక్క తండా గ్రామం అంతర్ రాష్ట్ర రహదారికి ఆనుకొని ఉంది. ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యాలు లేక అనునిత్యం వాహనదారులు, కాలినడకన వెళ్లేవారు నరకం అనుభవిస్తున్నారు. గ్రామం నుండి చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు రోడ్డు బాగోలేక ప్రమాదాలు జరిగిన సందర్భారాలు ఉన్నాయి. అత్యవసర సమయములో హాస్పిటల్ కి వెళ్లలేని పరిస్థితిలు నెలకొన్నాయి. ఈవిషయంపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న స్పందన లేకపోవడంతో సోమవారం గుట్టపక్క తండా గ్రామ ప్రజలు రహదారి పైన ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ సబ్ ఇన్స్పెక్టర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై పైఅధికారులతో మాట్లాడిస్తాను అని చెప్పడంతో గ్రామ ప్రజలు ఆందోళన విరమించారు. ఈ ధర్నాలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.