శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో హుండీ చోరీ

గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు,
సీసీ కెమెరాలు పర్యవేక్షణ లోపం….
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రాత్రి హుండీ చోరీ జరిగింది.గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయి,సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గత నెలలోనే ఆలయ హుండీ లెక్కింపు జరిగిందని అన్నారు.సుమారు 5000 నుండి 7000 రూపాయల వరకు ఉండొచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు.స్థానిక పాకాల పోలీసులు సంఘటనానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *