కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ముస్లీంల సమస్యలు

సిరా న్యూస్,కర్నూలు;
ముస్లింల సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని పోయి పరిష్కారం చేస్తానని ముస్లిం రాష్ట్రీయ మంచ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు కర్నూలు లో అన్నారు. కర్నూలు లోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ లో తాను ముస్లిం మైనారిటీ మోర్చా లో పనిచేసినందుకు బీజేపీ పెద్దలు తనకు దిల్లీలో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అధ్యక్షుడు గా నియమించారని తెలిపారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ముఖ్య ఉద్దేశ్యం భారతీయులందరి మధ్య సోదర భావం కల్పించడమే అన్నారు. ఆర్.ఎస్.ఎస్.లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ భాగమే అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకాంతో ముస్లిం ల అభివృద్ధి కి కృషి చేస్తానని హాఫీజ్ కరీముల్లా షేక్ తెలిపారు. ముస్లింలు హిందువులు వేరు కాదని అందరూ భారతదేశ పౌరులే అన్నారు. హిందూ, ముస్లింలకు మద్యన ఉన్న అపోహలను ముస్లిం రాష్ట్రీయ మంచ్ తొలగిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *