ఆయకట్టు రైతుల న్యాయం చేయండి

సిరా న్యూస్,మిడుతూరు;
మిడుతూరు మండలం, జలకనూరు గ్రామ మద్దిగుండం చెరువులోని సాగునీటిని విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా వాడుకోవడాన్ని అరికట్టాలని కోరుతూ జలకనూరు గ్రామ రైతులు డిఆర్ఓని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మైనర్ ఇరిగేషన్ అధికారులను కలిసి సమస్యను విన్నవించుకున్నారు.అనేక సంవత్సరాల నుండి జలకనూరు గ్రామంలో వర్షధారమైనటువంటి మద్దిగుండం చెరువు ద్వారా పంటలు సాగు చేసుకుని జీవిస్తున్నామని, ఈ సంవత్సరం జూన్ లో కురిసినటువంటి వర్షాల వల్ల చెరువు కు నీళ్లు రావడంతో వాటిపై ఆధారపడి మొక్కజొన్న, మిరప పంటలు సాగు చేసుకున్నామని, ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో పంటలు ఉన్నాయని,ఈ దశలో ఉన్నటువంటి కొద్దిపాటి నీరును మా పక్క గ్రామాల్లోని రైతంగం 120 విద్యుత్ మోటార్లను పెట్టి ఉన్న నీటిని సుదూర ప్రాంతాలకు అక్రమంగా తోడి వేయడం వల్ల ఆయకట్టు దారులైన రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు.ఈ విషయమై గతంలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మరియు ఇరిగేషన్ అధికారులు దృష్టికి సమస్య తీసుకురావడంతో పక్క గ్రామం రైతాంగాన్ని మోటార్లను తీసివేయమని చెప్పినా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం వల్ల ప్రస్తుతం ఆయకట్టు రైతులందరూ కూడా పంటను కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. తక్షణమే జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారులు మరియు రెవిన్యూ అధికారులు జోక్యంతో మద్దిగుండం చెరువు ఆయకట్టు రైతులకు పంట వచ్చేంతవరకు సాగునీరు విడుదల చేయాలని పక్క గ్రామం రైతాంగం నుండి సాగునీటి దోపిడీ నుండి ఆపి జలకనూరు గ్రామ రైతులకు రక్షణ కల్పించాలని వారి పంట వచ్చేందుకు అవసరమైన నీటిని ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *