సిరా న్యూస్,అన్నవరం;
కాకినాడ జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో వేంచేసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం లో శ్రీ అనంతలక్ష్మి అమ్మవారికి పెద్దాపురానికి చెందిన మట్టే సత్యప్రసాద్ దంపతులు కోటి యాభై లక్షల రూపాయల ఖరీదు చేసే వజ్రాలతో కూడిన బంగారు కిరీటం బహుకరించారు
మంగళవారం స్వామివారి ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఆ కిరీటానికి సంప్రోక్షణ జరిపి అలంకరించారు.ఈ సందర్భంగా ఈరోజు రత్నగిరిపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈవో, చైర్మన్, భక్తులు, గ్రామస్తులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.