సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివి: మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. మంగళవారం
కాల్వశ్రీరాంపూర్ మండల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జేయశంకర్ సార్ 90 జయంతిని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ ప్రధమ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోఅధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.