సిరాన్యూస్,కంబదూరు
అప్పుల బాధతో యువరైతు సూరి ఆత్మహత్య
కంబదూరు మండలం రాళ్ల అనంతపురంలో అప్పుల బాధ తాళలేక యువరైతు సూరి ఉరేసుకుని చనిపోయాడు. మంగళవారం ఉదయం తన పొలంలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నట్లు బంధువులు తెలిపారు. సూరికి తన 5ఎకరాల పొలంలో పంటలు పండించినా పెట్టుబడి దక్కక అప్పుల పాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు తీర్చే మార్గం తెలియక చావే శరణ్యంగా భావించి చెట్టుకురేసుకున్నాడన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజ కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మార్చురీ గది వద్ద సూరి మృతదేహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా అన్ని విధాల ఆదుకుంటామని ధర్మతేజ భరోసా ఇచ్చారు.