Desetti Padmavati: కాంగ్రెస్‌లో చేరిన మున్నూరు కాపు మ‌హిళా సంఘం ఆధ్య‌క్షురాలు దేశెట్టి ప‌ద్మావ‌తి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
కాంగ్రెస్‌లో చేరిన మున్నూరు కాపు మ‌హిళా సంఘం ఆధ్య‌క్షురాలు దేశెట్టి ప‌ద్మావ‌తి
* కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన కంది శ్రీ‌నివాస్‌రెడ్డి

ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌లు ముమ్మ‌ర‌మ‌య్యాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ముంగిట చేరిక‌ల‌తో పార్టీలో జోష్ క‌నిపిస్తోంది. బుధ‌వారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని 3 వ‌వార్డ్ మాజీ కౌన్సిల‌ర్ మున్నూరు కాపు మ‌హిళా సంఘం ఆధ్య‌క్షురాలు దేశెట్టి ప‌ద్మావ‌తి ప్ర‌కాష్ కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలోకాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు 3వ వార్డ్ కు చెందిన ప‌లువురు మ‌హిళ‌లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. వారంద‌రికీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు కంది శ్రీ‌నివాస రెడ్డి .రానున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అంతా క‌ల‌సి స‌త్తా చాటాల‌ని అన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచేలా క‌లిసి క‌ట్టుగా కృషి చేయ‌ల‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్య‌క్ర‌మంలో లోక ప్రవీణ్ రెడ్డి, గుడిపెల్లి నగేష్,గీమ్మ సంతోష్,కౌన్సిలర్లు బండారి సతీష్, సంద నర్సింగ్, ఆవుల వెంకన్న,పోరెడ్డి కిషన్,బైన్వార్ గంగారెడ్డి, ఎంఏ, షకీల్, ఏంఏ కయ్యుమ్, యాళ్ల పోతారెడ్డి, మహాకల్ అజయ్, సురేందర్, అతిక్, బూర్ల శంకరయ్య, సమీర్ అహ్మద్, రావుల సోమన్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *