సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దదారులకు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చిన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దదారులకు అందజేశామని, ప్రజలు ఎవ్వరు కూడా ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేసుకునేటప్పుడు దళారులను నమ్మవద్దని, స్వయంగా వారి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీడీసీ చైర్మన్ కూచడి శ్రీహరి రావు , ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ,వైస్ చైర్మన్ కావలి సంతోష్ ,కౌన్సిలర్ నాయకులు జన్నారపు శంకర్ , షబ్బీర్ పాషా , మండల అధ్యక్షులు దొనికిని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, పట్టణ మండల నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.