CYSF Sheetalkar Arvind: ఎంఈఓపై శాఖ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
ఎంఈఓపై శాఖ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి
సీవైఎస్ఎఫ్ నిర్మల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కార్ అరవింద్
* కలెక్టర్ కార్యాల‌యంలో వినతి పత్రం అంద‌జేత‌

ఆరు మండలాలకు ఎంఈఓ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ అక్రమ డిప్యూటేషన్లు ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తున్నారని, ఈ అంశంపై తగిన విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాల‌ని సీవైఎస్ఎఫ్ నిర్మల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కార్ అరవింద్ అన్నారు. ఈసంద‌ర్బంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఈ విషయంపై జిల్లా విద్యాధికారి కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేద‌న్నారు. ప్రతి సంవత్సరం కూడా అక్రమ డిప్టేషన్ లో చేయడం, మళ్లీ పేపర్లో ఆ వార్త వచ్చేసరికి తిరిగి ఆ డిప్యూటేషన్ రద్దు చేయడం పరిపాటిగా మారింద‌న్నారు. సమగ్ర విచారణ జరిపి ఎంఈఓ మధుసూదన్ పై చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *