BJP Anji Kumar Reddy: హర్ ఘర్ తిరంగా ను విజ‌య‌వంతం చేయండి: బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
హర్ ఘర్ తిరంగా ను విజ‌య‌వంతం చేయండి: బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి

హర్ ఘర్ తిరంగా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి అన్నారు. బుధ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఆగస్టు 15ను పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి ఇంటి పైన జాతీయ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగురవేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి జాతీయ భావన పెంపొందించాలని సూచించారు. 78 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి బూత్ లో ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వ‌హించాల‌ని సూచించారు. స‌మావేశంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి,  జిల్లా ఉపాధ్యక్షులు కమల్ నయన్, ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్, మండల అధ్యక్షులు టేకు ప్రకాష్, పెంబి మండల అధ్యక్షులు ఐదు వెంకటేష్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శి కొండవేణి రమేష్, పెద్ది రమేష్ , పుప్పాల ఉపేందర్, సీనియర్ నాయకులు పొద్దుటూరు గోపాల్ రెడ్డి, గాడ్పు రవీందర్, మధిరే శ్రీనివాస్, కంతి లింబాద్రి ,పుప్పల పవన్, అనిల్ రావు, ఎనగందుల రవి, నల్లూరి శ్రీధర్ , కర్ణాటక భీమన్న, రాజేందర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *